జనాభా లెక్కల సేకరణకు గెజిట్ విడుదల
The Central Government today (Monday) issued a gazette notification on the census.;
జనాభా లెక్కల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఈ రోజు(సోమవారం) గెజిట్ విడుదల చేసింది. 2026 అక్టోబర్ నుంచి రెండు దశల్లో జనాభా లెక్కల సేకరణ జరుగనుంది. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో దేశంలో 15 ఏళ్ల తర్వాత జనాభా లెక్కలు సేకరణ జరగనుంది. జనాభా లెక్కల ప్రక్రియపై ఈరోజు(సోమవారం) కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. హోం సెక్రటరీ, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు.
దేశచరిత్రలో మొదటిసారి జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టనున్నారు. 2026 అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి జనాభా లెక్కల సేకరణ ప్రారంభం అవుతుంది. రెండు దశల్లో పూర్తిచేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లడఖ్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తొలి విడతలో జనగణన చేపడతారు. 2027 మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే రెండో దశలో దేశంలోని మిగతా రాష్ట్రాల్లో జనాభ లెక్కలు సేకరిస్తారు.
ఇందుకోసం మొత్తం 34లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34లక్షల మంది సిబ్బంది పని చేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదుచేసే వెసులుబాటునూ కల్పిస్తున్నారు.
బీహార్లో ఈ ఏడాది చివరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ప్రకటన చేయడం గమనార్హం. బీహార్ జనాభాలో 63% పైగా ప్రజలు వెనుకబడిన తరగతులకు చెందినవారుకాగా ప్రతి వ్యక్తి తన కులం, మతం వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.