Bangladesh Creates History:  ఢాకాలో జరిగిన పాకిస్తాన్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌట్ అయింది. జకెర్ అలీ (55 పరుగులు) మరియు మెహదీ హసన్ (33 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్ టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది, కేవలం 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఫహీమ్ అష్రఫ్ (51 పరుగులు) ఒంటరి పోరాటం చేసినా అది విజయం సాధించడానికి సరిపోలేదు.

బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం (3/17) అద్భుతమైన బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. తన్జీమ్ హసన్ షకిబ్ (2/23) మరియు మెహదీ హసన్ (2/25) కూడా రెండేసి వికెట్లు తీశారు. జకెర్ అలీ తన కీలక హాఫ్ సెంచరీకి గాను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు.

Tags: