Cricket: మిస్టర్ కూల్ అరుదైన ఘనత

అరుదైన ఘనత;

Update: 2025-06-10 04:53 GMT

Cricket: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మరో అరుదైన ఘనత దక్కింది. భారత్ జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనికి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‎’లో చోటు లభించింది. లండన్‎లో జరిగిన ఓ కార్యక్రమంలో హాల్ ఆఫ్ ఫేమ్‎లో చేర్చిన వారి పేర్లను ఐసీసీ ప్రకటించింది. మొత్తం ఏడుగురుని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‎లో చేర్చింది. ఇందులో కెప్టెన్ కూల్ ఒకరు. దీంతో ఇండియా తరుఫున ఈ ఘనత సాధించిన 11వ క్రికెటర్‎గా‌‌‌‌‌‌‌ ధోని రికార్డులకెక్కాడు.ధోని కంటే ముందు 10 మంది భారత క్రికెటర్ల మాత్రం ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్‎లో చోటు దక్కించుకున్నారు. ఇందులో భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే వంటి వారి ఉన్నారు. తాజాగా ధోని వారి సరసన చేరాడు.

14 ఏండ్ల ఇంటర్నేష నల్ కెరీర్లో ఆటగాడిగా, కెప్టెన్గా ధోనీ ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలను (వన్డే, టీ20 వరల్డ్ కప్స్, చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఏకైక కెప్టెన్గా చరిత్రలో నిలిచిపోయాడు. మహీ కెప్టెన్సీలోని ఇండియా 2009లో తొలిసారిగా టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగు పెట్టిన ధోనీ మొత్తంగా 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ముఖ్యంగా వన్డేల్లో 10,773 రన్స్ తో ఎక్కువ సక్సెస్ సాధించాడు. వికెట్ కీపర్ గా 829 డిస్మిసల్స్ చేశాడు.

Tags:    

Similar News