India and England Players: నల్ల రిబ్బన్స్ తో భారత్ - ఇంగ్లాండ్ ఆటగాళ్లు..ఎందుకంటే..?
భారత్ - ఇంగ్లాండ్ ఆటగాళ్లు..ఎందుకంటే..?;
India and England Players: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమైంది. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్ లీడ్స్లోని చారిత్రాత్మక మైదానం హెడింగ్లీలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో యువ భారత బ్యాట్స్మన్ సాయి సుదర్శన్ తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేయగా.. కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత ప్లేయింగ్ ఎలెవన్లోకి వచ్చాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో రెండు జట్ల ఆటగాళ్లు నల్లటి చేతి బ్యాండ్లు ధరించి మైదానంలోకి ప్రవేశించారు. ఆటగాళ్ళు ఈ నల్లని ఆర్మ్ బ్యాండ్ ను ఎందుకు ధరించారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రెండు నిమిషాలు మౌనం పాటించారు..
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారికి నివాళులు అర్పించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు నల్లటి చేతి బ్యాండ్లు ధరించి సంఘీభావం ప్రకటించారు. అలాగే జాతీయ గీతాలాపనకు ముందు రెండు జట్లు రెండు నిమిషాల మౌనం పాటించాయి. నిజానికి జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం నంబర్ AI171, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు.
270 మందికి పైగా మరణించారు:
జూన్ 12న మధ్యాహ్నం 1:38 గంటలకు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులతో పాటు బ్రిటన్, పోర్చుగల్, కెనడా పౌరులు ఉన్నారు. ఈ ఘోర ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా మొత్తం 270 మందికి పైగా మరణించారు. మృతుల కుటుంబాలకు సంఘీభావంగా ఇరుజట్ల ప్లేయర్లు నల్ల రిబ్బన్స్ కట్టుకున్నారు.
రెండు జట్లు ఇవే :
టీమిండియా:
జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఇంగ్లాండ్:
జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోష్ టోంగ్, షోయబ్ బషీర్.