India vs England: ఇవాళ్టి నుంచి ఇండియా ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్
ఫస్ట్ టెస్ట్;
India vs England: ఇండియా యంగ్ టెస్ట్ టీమ్ కొత్త ఆరంభానికి రెడీ అయ్యింది. నేటి నుంచి ఇరుజట్ల మధ్య తొలి పోరు జరగనుంది. గత తొమ్మిది దశాబ్దాలలో 1971లో అజిత్ వాడేకర్ బ్యాచ్, 1986లో కపిల్ డెవిల్స్, 2007లో రాహుల్ ద్రవిడ్ బృందం మాత్రమే ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్లు గెలిచాయి. ఆ తర్వాత ఏ జట్లూ ఈ ఘనత సాధించలేదు. కొత్త కెప్టెన్ 25 ఏళ్ల శుభ్మన్ గిల్ భవిష్యత్కు ఈ సిరీస్ అత్యంత ప్రధానం కాబోతున్నది. బ్యాటర్గా ఏం చేస్తాడనే దానిని కాసేపు పక్కనబెడితే టీమిండియా 37వ కెప్టెన్గా గిల్ జట్టును ఏ మేరకు నడిపిస్తాడన్నదే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తొలి టెస్ట్కు వేదికైన లీడ్స్లో ఉష్ణోగ్రత 29 డిగ్రీల వరకు ఉంది. 22 గజాల పిచ్పై 8 మిల్లీ మీటర్ల గడ్డి ఉంది. కాబట్టి ఈ వికెట్ ఇంగ్లండ్ బజ్బాల్ స్ట్రాటజీకి అనుకూలం కాదు. అయితే ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు ఒత్తిడిని భరించడంపైనే ఈ సిరీస్ విజయం ఆధారపడి ఉంటుంది. 36 సెంచరీలతో కలిపి 13 వేల రన్స్ చేసిన జో రూట్ ఇంగ్లండ్కు కొండంత అండ. టీమిండియాలో కేఎల్ రాహుల్ (58 టెస్ట్లు, 3257 రన్స్) మినహా మిగతా బ్యాటర్లకు అనుభవం లేదు. కాకపోతే బౌలింగ్లో అసమానమైన జస్ప్రీత్ బుమ్రా ఉండటం ఇండియాకు తిరుగులేని బలాన్నిస్తోంది. బుమ్రా మూడు టెస్ట్లకు మాత్రమే అందుబాటులో ఉంటాడు కాబట్టి తొలి మ్యాచ్ నుంచే పోరాటం మొదలుపెట్టాలి.
జట్లు
ఇండియా: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ / నితీశ్ కుమార్ / కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, బుమ్రా, సిరాజ్.
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జెమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సీ, జోష్ టంగ్, షోయబ్ బషీర్..