Gambhir: తల్లికి గుండెపోటు.. ఇండియాకు గంభీర్
ఇండియాకు గంభీర్;
Gambhir: తన తల్లి సీమా గంభీర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్ నుంచి హుటాహుటిన శుక్రవారం ఇండియాకు తిరిగొచ్చాడు. గుండెపోటుకు గురైన సీమా ప్రస్తుతం ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమెను చూసేందుకు గౌతీ వచ్చాడని వర్గాలు తెలిపాయి. గంభీర్ గైర్హాజరీతో ఇండియా, ఇండియా-ఎ జట్ల మధ్య జరిగే ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ను అసిస్టెంట్ కోచ్ రైన్ టెన్ డక్కటే పర్యవేక్షించనున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ కోచ్ లు సితాన్లు కొటక్, మోర్నీ మోర్కెల్ అతనికి సహాయం అందించనున్నారు. తల్లి ఆరోగ్యం కుదుటపడితే వారం రోజుల్లో గంభీర్ ఇంగ్లండుకు తిరిగి వెళ్లనున్నాడు. 'ఐసీయూలో ఉన్న గంభీర్ తల్లి క్రమంగా కోలుకుంటున్నది. అన్ని సవ్యంగా జరిగితే అతను తొలి టెస్ట్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ కు తిరిగివచ్చే చాన్స్ ఉంది అని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
ఇంగ్లాండ్తో భారత్ తమ తొలి టెస్టు జూన్ 20 న ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఆడనుంది.ఇండియా ఎ జట్టు తరఫున ఆడుతున్న ఎనిమిది మంది సీనియర్ ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లాండ్ లయన్స్తో రెండు వార్మప్ మ్యాచ్లు ఆడారు. రెండ టెస్ట్ మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. టెస్ట్ సిరీస్కు ముందు గంభీర్, కొత్త కెప్టెన్ శుభ్మాన్ గిల్ తుది జట్టును అంచనా వేయడానికి ఈ మ్యాచ్ ఆటగాళ్లకు కీలకం కానుంది. కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, యశస్వి జైస్వాల్ ఇంట్రా-స్క్వాడ్ గేమ్లో ఎక్కడ ఆడతారో ఇంకా తెలియలేదు.