Rishabh Pant: రికార్డ్ సృష్టించిన పంత్..భారత్ నుంచి ఒకే ఒక్కడు
భారత్ నుంచి ఒకే ఒక్కడు;
Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డ్ సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 800 రేటింగ్ పాయింట్లు సంపాదించి ఈ ఘనత సాధించిన తొలి భారత వికెట్ కీపర్ గా నిలిచాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండు సెంచరీలు చేసి ఒక స్థానం ఎగబాకి ఏడో స్థానానికి చేరుకున్నాడు. కెప్టెన్ శుభమాన్ గిల్ తన సెంచరీతో ఐదు స్థానాలు ఎగబాకి 20 వ స్థానానికి చేరుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 179 పరుగులు చేసిన రాహుల్.. 10 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కెరీర్లో 851 రేటింగ్ పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (889) టెస్ట్ క్రికెట్ లో నెంబర్1 స్థానంలో కొనసాగుతున్నాడు.
వైస్ కెప్టెన్ బ్రూక్ రెండో స్థానంలో ఉన్నాడు. విలియంసన్ మూడో స్థానంలో.. స్మిత్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. టీమిండియాతో తొలి టెస్టులో మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న బెన్ డకెట్..కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ సంపాదించి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన ఓలీ పోప్ మూడు స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకోగా, జేమీ స్మిత్ కెరీర్లో అత్యుత్తమంగా 27వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ లో బుమ్రా టాప్ ర్యాంకు నిలబెట్టుకున్నాడు.