Rishabh Pant's Rare Feat: ఇంగ్లీష్ గడ్డపై వరుసగా సెంచరీలు.. 147 సంవత్సరాలలో రెండో వికెట్ కీపర్..
147 సంవత్సరాలలో రెండో వికెట్ కీపర్..;
Rishabh Pant's Rare Feat: లీడ్స్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్లో రెండు జట్లు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చాయి. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ భారత్ తరఫున మరో సెంచరీ సాధించడంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. దానికి సమాధానంగా ఇంగ్లాండ్ కూడా 465 పరుగులు చేసి, కేవలం 6 పరుగుల వెనుకబడి ఉంది. మూడో రోజు 90 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా, మూడో రోజు ఆట తొలి సెషన్లో కెప్టెన్ శుభ్మాన్ గిల్ను కోల్పోవడంతో కష్టాల్లో పడింది.
ఈ సమయంలో, కేఎల్ రాహుల్తో కలిసి వచ్చిన వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేశాడు పంత్. కేవలం 130 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 13 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. టెస్ట్ క్రికెట్లో రెండు ఇన్నింగ్స్లలోనూ సెంచరీ చేసిన ఏకైక వికెట్ కీపర్ జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్, 2001లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు.
ఈరోజు ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఈ రికార్డు సాధించడం ద్వారా, రిషబ్ పంత్ ఆండీ ఫుల్లర్ పేరిట ఉన్న 25 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్గా నిలిచాడు. భారత్ తరపున ఒక మ్యాచ్లోని రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాను మనం పరిశీలిస్తే, విజయ్ హజారే, సునీల్ గవాస్కర్ (3 సార్లు), రాహుల్ ద్రవిడ్ (2 సార్లు), విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రోహిత్ శర్మ మాత్రమే అలా చేశారు. ఈ ఘనత సాధించిన 7వ భారతీయ ఆటగాడిగా నిలిచాడు.