Asia Archery Championship: ఆసియా ఆర్చరీలో సురేఖకు రెండు మెడల్స్
సురేఖకు రెండు మెడల్స్
Asia Archery Championship: ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్స్ 2025లో (ఢాకా, బంగ్లాదేశ్) భారత క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ అద్భుతమైన ప్రదర్శన చేసి ఏకంగా రెండు స్వర్ణ పతకాలు (Gold Medals) సాధించింది.
వ్యక్తిగత కాంపౌండ్ (Individual Compound) లో గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో ఆమె తన తోటి భారత క్రీడాకారిణి ప్రతీక ప్రదీప్ను ఓడించింది. ఈ విజయంతో, ఆమె మూడు వ్యక్తిగత ఆసియా టైటిళ్లు గెలిచిన మొట్టమొదటి ఆర్చర్గా చరిత్ర సృష్టించింది.మహిళల కాంపౌండ్ టీమ్ లోనూ గోల్డ్ మెడల్ సాధించింది జ్యోతి సురేఖ, ప్రతీక ప్రదీప్, దీప్షికలతో కూడిన భారత జట్టు కొరియా జట్టును ఓడించి బంగారు పతకం గెలుచుకుంది.దీంతో పాటు, కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్కు రజత పతకం (Silver Medal) కూడా లభించింది. జ్యోతి సురేఖ విజయాలతో సహా, ఈ ఛాంపియన్షిప్స్లో కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ మొత్తం ఐదు పతకాలు (మూడు స్వర్ణాలు, రెండు రజతాలు) సాధించింది.