CM Revanth Reddy: సీఎం రేవంత్ ఆదేశాలు: తెలంగాణలో పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి
అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి
CM Revanth Reddy: తారామతి బారాదరి, దుర్గం చెరువు ప్రాంతాలను పూర్తిస్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో పర్యాటక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం, పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన సూచనలు చేశారు.
మంజీరా, దిల్కుషా గెస్ట్ హౌస్లను ఆధునికీకరించాలని, టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. అక్కడి వీరభద్ర స్వామి ఆలయాన్ని మెరుగుపరచడంతో పాటు యాదగిరిగుట్ట తరహాలో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
క్యూర్ పరిధిలోని అటవీశాఖ భూములను ఎకో టూరిజం కేంద్రాలుగా తీర్చిదిద్దాలని, గుర్రంగూడ ఎకో పార్కు తరహాలో నగరంలో మరిన్ని పార్కులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలోని అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి, అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్టుల కోసం ప్రత్యేకాధికారులను నియమించాలని సీఎం స్పష్టం చేశారు.
పురానాపూల్, హెరిటేజ్ బ్రిడ్జిలను పర్యాటక ప్రాంతాలుగా మార్చాలని, ట్రాఫిక్ను మళ్లించి బ్రిడ్జిపై పర్యాటకులకు అనుకూలమైన ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. డిసెంబర్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఏర్పాట్లను త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమీక్షలో పర్యాటక శాఖ అధికారులు ప్రస్తుత స్థితిగతులు, ప్రతిపాదిత పనుల వివరాలు సీఎంకు అందించారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యల్లో ఇవి ముఖ్యమైన భాగం కావని వర్గాలు తెలిపాయి.