Adinarayana Reddy: వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకుంటున్నారు: ఆదినారాయణ రెడ్డి
దోషులను జగన్ వెనకేసుకుంటున్నారు: ఆదినారాయణ రెడ్డి
Adinarayana Reddy: వైకాపా నాయకులు జగన్ మెప్పు కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘అభివృద్ధిని ఓర్చుకోలేని జగన్.. రాష్ట్రం, ప్రజలపై కుట్రలు చేస్తున్నారు. వైకాపా అంతరించిపోయే పార్టీ.. అందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ధైర్యం ఉంటే చర్చకు రండి. వైకాపా నాయకులు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోలేరు. వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకుంటున్నారు’’ అని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు.
ఈ ఆరోపణలు వైకాపా పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని భాజపా వర్గాలు తెలిపాయి.