CM Chandrababu: ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం: మోదీ పాలనపై తీర్మానం ప్రవేశపెడతారు సీఎం చంద్రబాబు

మోదీ పాలనపై తీర్మానం ప్రవేశపెడతారు సీఎం చంద్రబాబు

Update: 2026-06-10 10:39 GMT

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీఏ (NDA) కీలక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సమావేశం జాతీయ రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ భేటీలో ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలన, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, దేశ అభివృద్ధికి చేపట్టిన ముఖ్య కార్యక్రమాలపై ప్రత్యేక తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నేతలు విస్తృత చర్చ నిర్వహించనున్నారు. రాబోయే కాలంలో దేశ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలు, కూటమి బలోపేతం వంటి అంశాలపై కూడా చర్చ జరగే అవకాశం ఉంది.

ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీల పాత్ర, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించే సహకారం, వివిధ రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాల బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం వంటి అంశాలు కూడా సమావేశ అజెండాలో ఉండే అవకాశముంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

ఈ సమావేశం ద్వారా ఎన్డీఏ కూటమి మరింత బలోపేతం కావడంతో పాటు, దేశ అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మార్గాలు సుగమం కావాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News