పద్మావతి అతిథి గృహంలో అధికారుల విచారణ.. మాజీ పోలీసులు, వీజీఓ హాజరు

రవికుమార్ విదేశీ కరెన్సీ దొంగతనం.. కోట్లు సంపాదించి లోక్‌అదాలత్‌లో రాజీ

వైకాపా హయాంలో జరిగిన దారుణం.. తిరుపతి పోలీసులు ఫిర్యాదు

Tirumala Parakamani Theft Case: తిరుమల పరకామణిలో జరిగిన చోరీ కేసులో అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. గతంలో తిరుమల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఎస్సై లక్ష్మీరెడ్డి, సీఐ జగన్‌మోహన్ రెడ్డి మొదలైనవారు విచారణకు హాజరయ్యారు. అప్పటి తితిదే వీజీఓగా పనిచేసిన గిరిధర్ కూడా సీఐడీ అధికారుల ముందు హాజరయ్యారు.

చోరీ ఎలా జరిగింది?

పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి ఓ మఠం తరఫున పనిచేసేవాడు. ఏళ్ల తరబడి గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీని లెక్కించేది. చాలాకాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. వైకాపా హయాంలో 2023 ఏప్రిల్ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ.. అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకుని అరల్లో దాచుకున్నాడు. అతని కదలికలపై అనుమానం వచ్చి సిబ్బంది తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. దీనిపై అప్పటి ఏవీఎస్వో సతీష్‌కుమార్ ఫిర్యాదు చేయడంతో రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ రోజు అతడు 900 డాలర్లు అపహరించగా, అప్పటి రేటు ప్రకారం వాటి విలువ రూ.72 వేలుగా తేల్చారు (డాలర్‌కు రూ.80). అయితే, అసలు 112 నోట్లు దొరికినా.. రికార్డుల్లో తొమ్మిది నోట్లు మాత్రమే చూపించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఇలా చాలాకాలంగా పరకామణిలో చేతివాటం చూపించి కాజేసిన సొమ్ముతో రవికుమార్ రూ.కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలు ఉన్నాయి. ఇది తెలుసుకున్న వైకాపా పార్టీలోని కొందరు పెద్దలు లోక్‌అదాలత్‌లో కేసును రాజీ చేయించి, అతడి ఆస్తులను కొట్టేసినట్లు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. మరిన్ని వివరాలు త్వరలోనే బయటపడనుంది.

Tags: