BYD : క్రెటా ఎలక్ట్రిక్కు కొత్త టెన్షన్.. చైనా అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇండియాలో లాంచ్!
చైనా అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు ఇండియాలో లాంచ్!;
BYD : చైనాకు చెందిన ప్రముఖ ఆటో కంపెనీ బీవైడీ భారతదేశంలో తమ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ కంపెనీ ఇప్పటికే భారత మార్కెట్లో అటో 3, సీల్, ఈమాక్స్ 7, సీలయన్ వంటి కార్లను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ బీవైడీ అటో 2ను భారతదేశంలో పరీక్షిస్తోంది. ఇటీవల ఈ కారు భారతీయ రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది. మోడల్ ఇప్పటికే యూకే మార్కెట్లో విడుదలైంది. దీని ఫీచర్లు,సెటప్లో కొద్దిగా మార్పులు చేయవచ్చని భావిస్తున్నారు. అందుకే దీని ధర భారతదేశంలో రూ.35 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. భారతదేశంలో లాంచ్ అయిన తర్వాత ఈ కారు నేరుగా క్రెటా ఎలక్ట్రిక్తో పోటీ పడనుంది.
ఒకవేళ వాహన తయారీ సంస్థ యూరో-స్పెక్ బీవైడీ అటో 2ను భారతదేశంలో విడుదల చేస్తే, ఇందులో 45 kWh బీవైడీ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే డబ్ల్యుఎల్టిపి ప్రకారం 463 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. బీవైడీ అటో 2లో ఎఫ్డబ్ల్యుడి మోటార్ ఉంది. ఇది 174 బీహెచ్పీ పవర్, 290 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ పవర్ట్రైన్ దీనిని 7.9 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి, గంటకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది.
డిజైన్ విషయానికి వస్తే, బీవైడీ అటో 2 ముందు వైపు నుంచి చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో మోబియస్ రింగ్ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఎన్ఎఫ్సీ కీ, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, పనోరమిక్ సన్రూఫ్, అల్యూమినియం రూఫ్ రైల్స్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.