Per Capita Income : తలసరి ఆదాయంలో 4వ స్థానానికి పడిపోయిన తెలంగాణ.. ఫస్ట్ ప్లేసులో ఏ రాష్ట్రం ఉందంటే ?
ఫస్ట్ ప్లేసులో ఏ రాష్ట్రం ఉందంటే ?;
Per Capita Income : 2025 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం ఆధారంగా కర్ణాటక రాష్ట్రం భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభలో ఇచ్చిన సమాధానం ప్రకారం.. కర్ణాటక నికర తలసరి ఆదాయం రూ.2 లక్షల మార్కును దాటింది. ముఖ్యంగా బెంగళూరు వంటి నగరాల్లోని టెక్నాలజీ, స్టార్టప్ సంస్కృతి ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 6.6% వృద్ధిని చూపగా, గత పదేళ్లలో ఏకంగా 94% పెరగడం విశేషం.
2025 ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి లేదా తలసరి ఆదాయం రూ.2,04,605 కు పెరిగింది. ఇది 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,05,697 గా ఉండేది. అంటే, గత 10 సంవత్సరాలలో 93% వృద్ధిని సాధించింది. భారతదేశంలో జాతీయ స్థాయిలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో తలసరి నికర జాతీయ ఆదాయం రూ.1,14,710 గా ఉంది. ఇది దశాబ్దం క్రితం ఉన్న రూ.72,805 కంటే 57.6% ఎక్కువ.
టాప్ 5 రాష్ట్రాలు ఇవే
2025 ఆర్థిక సంవత్సరానికి NSDP ఆధారంగా కర్ణాటక అగ్రస్థానంలో ఉండగా ఇతర రాష్ట్రాల స్థానాలు ఇలా ఉన్నాయి:
1వ స్థానం: కర్ణాటక - రూ.2,04,605
2వ స్థానం: తమిళనాడు - రూ.1,96,309
3వ స్థానం: హర్యానా - రూ.1,94,285
4వ స్థానం: తెలంగాణ
5వ స్థానం: మహారాష్ట్ర
2023-24లో అత్యధిక వార్షిక వృద్ధిని నమోదు చేసిన రాష్ట్రాలలో మిజోరాం (125.4%), గుజరాత్ (90.7%), గోవా (89.9%), కర్ణాటక (88.5%), తెలంగాణ (84.3%), ఒడిశా (83.4%) ఉన్నాయి.