ఎమ్ఎస్ఎమ్ఇ ట్రేడర్స్ సమస్యలు పరిష్కరిస్తా...

...కేంద్ర మంత్రి జితెన్ రామ్ మాంజీ;

Update: 2025-05-27 06:44 GMT

ఎమ్ఎస్ఎమ్ఇ ట్రేడర్స్, టెక్స్ టైల్స్ ఇండ్రస్ట్రీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి జితెన్ రామ్ మాంజీ తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ టూరిజం ప్లాజాలో తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి జితెన్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షుడు ప్రకాష్, ప్రతినిధి సతీష్ లు మంత్రికి ఎమ్ఎస్ఎమ్ఇ ట్రేడర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. దీంతో పాటు ఫెడరేషన్ తరపున ఇంటరాక్షన్ సమావేశంలో ఎమ్ ఎస్ ఎమ్ ఈల తరహాలో ట్రేడర్స్ కి కూడా సబ్సీడి బ్యాంక్ రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని కేంద్రమంత్రిని ఛాంబర్ అధ్యక్షుడు ప్రకాష్ కోరారు. జీఎస్టీ స్లాబుల విషయంలో కూడా 5 శాతం చేయాలని కోరామన్నారు. ఆన్ లైన్ ఫ్లాట్ ఫ్లామ్ ప్రభావం వల్ల మీడియం, స్మాల్ ట్రేడర్స్ కి నష్టం జరుతోందని.. వారి కోసం ఓ పాలసీ రూపొందించాలని కోరారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల అభివృద్దికి మరిన్ని సంస్కరణలు తీసుకురావాల్సిన అవరముందన్నారు. ఈ అంశాల పై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పేర్కొన్నారు.

Tags:    

Similar News