Bandla Ganesh: బండ్ల గణేశ్ ట్వీట్ కలకలం: ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్?

ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్?

Update: 2025-09-24 13:32 GMT

Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన ట్విటర్‌లో చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు... నీవు చేయని వాటిని మాత్రమే చూస్తారు. కృతఙ్ఞత లేని వ్యక్తిని ఎప్పటికీ సంతృప్తిపరచలేవు” అని ఆయన ట్వీట్ చేశారు.

నెటిజన్లలో, సినీ వర్గాల్లో చర్చ

బండ్ల గణేశ్ ఈ పోస్ట్‌ను ఎవరిని ఉద్దేశించి పెట్టారనే దానిపై ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ ట్వీట్ టాలీవుడ్‌లో ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. గతం నుంచి ఆయనకు పవన్ కల్యాణ్‌తో ఉన్న అనుబంధం, రాజకీయాల్లో ఆయనకు మద్దతు పలకడం వంటి అంశాల నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. బండ్ల గణేశ్ వ్యాఖ్యలు ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాయనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News