Anchor Rashmi Gautam Makes Sensational Decision: జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. ఆమె ప్రస్తుతం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు. "నేను ఎక్కడో కుంగిపోతున్నాను. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కనుగొనవలసిన సమయం ఆసన్నమైంది" అని ఆమె తెలిపారు. సోషల్ మీడియా కొన్నిసార్లు ఆలోచనలను డిస్టర్బ్ చేస్తుందని, తీవ్రంగా ప్రభావితం చేస్తుందని రష్మి అభిప్రాయపడ్డారు. మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియాకు దూరం కావాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఈ విరామం తన శక్తిని పునరుద్ధరించుకోవడానికి మరియు బలంగా, ధైర్యంగా తిరిగి రావడానికి సహాయపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే "అడ్డమైన నీతులు వినే ఓపిక, తీరిక తనకు లేదని" కూడా ఆమె పరోక్షంగా పేర్కొన్నారు. రష్మి తన అభిమానులనుద్దేశించి, "మీ అందరికీ ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను మళ్ళీ తిరిగి వస్తాను, ఈసారి ఎంతో దృఢంగా మీ ముందు నిలబడతాను. సోషల్ మీడియాలో నేను యాక్టివ్‌గా లేకపోయినా, మీ ప్రోత్సాహం, ప్రేమ, సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను" అని తెలిపారు. రష్మి గతంలో కూడా జంతు సంరక్షణ, సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో చాలా చురుకుగా స్పందించేవారు. ఆమె ఈ విరామం తీసుకొని, తిరిగి మరింత ఉత్సాహంగా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags: