Giri Pradakshina: యాదగిరి గుట్టలో వైభవంగా గిరి ప్రదక్షిణ

వైభవంగా గిరి ప్రదక్షిణ;

Update: 2025-07-05 17:42 GMT

Giri Pradakshina:  శ్రీలక్ష్మీ నరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి సందర్భంగా ఇవాళ యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్లవారుజామున 5:30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద వద్ద ప్రత్యేక పూజలు చేసి గిరిప్రదక్షిణ ఆరంభించారు. గిరిప్రదక్షి ణలో భాగంగా భక్తులు రెండున్నర కిలోమీ టర్లు కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేశారు. అనంతరం కొండపైకి చేరుకుని గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

గిరిప్రదక్షిణ చేసిన భక్తులకు దేవస్థాన ఆఫీసర్లు ప్రత్యేక దర్శనం సదుపాయం కల్పించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. గిరిప్రదక్షిణలో భాగంగా కొందరు భక్తులు భజన, నృత్య బృందాలు చేసిన భజనలు, భక్తిగీతాలు, కీర్తనలు, సంకీర్తనలు, నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా అలరించారు.ఘనంగా అష్టోత్తర శతఘటాభిషేకం దేవస్థానంలో అష్టోత్తర శతఘటాభిషేక కైం కర్యాన్ని ఆలయ అర్చకులు అట్టహాసంగా నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి సందర్భంగా స్వామి అమ్మవార్లకు శత ఘటాభిషేకాన్ని ఘనంగా చేపట్టారు. ప్రధానాలయ ముఖ మంటపంలో, గర్భగుడికి అభి ముఖంగా, స్వర్ణ ధ్వజస్తంభానికి ఎదురుగా శుద్ధ జలంతో కూడిన 108 వెండి కలశాల ను వరుసగా పేర్చి ప్రత్యేక పూజలు చేశారు.

Tags:    

Similar News