Heart Attacks: గుండెపోట్లకు కారణాలేంటీ..? కర్ణాటక నిపుణుల కమిటీ తేల్చింది ఇదే..
కర్ణాటక నిపుణుల కమిటీ తేల్చింది ఇదే..;
Heart Attacks: కరోనా తర్వాత గుండెపోటు కేసులు ఎక్కువయ్యాయి. చిన్న నుంచి పెద్దవరకు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. ఇక ఇటీవల కర్ణాటకలో వరుస గుండెపోటు మరణాలు అక్కడి ప్రభుత్వానికి నిద్రలేకుండా చేశాయి. దాంతో హసన్లో సంభవించిన గుండెపోటు కేసుల శ్రేణిని అధ్యయనం చేయడానికి ప్రభుత్వం రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ కమిటీకి సంబంధించిన నివేదికలో కీలక విషయాలు ఉన్నాయి. కరోనావైరస్ నుండి కోలుకున్న వారికి కొన్ని గుండె సమస్యలు ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ గుండెపోటుకు కారణం కాదు. అయితే కరోనా స్వల్ప మొత్తంలో సమస్యలను కలిగిస్తోందని నివేదికలో ఉంది. కరోనా తర్వాత గుండె పనితీరు తగ్గిందని కూడా నిపుణులు నివేదికలో ప్రస్తావించారు. అలాగే, కరోనావైరస్ నుండి కోలుకున్న వారు నిద్రలేమి, అలసట, శ్వాసకోశ సమస్యలు, ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించిన నిపుణులు కీలక సూచనలు చేశారు.
నిపుణుల సూచనలు ఏమిటి?
చక్కెర, ఉప్పు తీసుకోవడం తగ్గించండి.
కనీసం 6 గంటలు నిద్రపోవాలి.
పిల్లలకు స్క్రీనింగ్ సమయాన్ని తగ్గించాలి.
ఒత్తిడి తగ్గించుకోవాలి.
శారీరక శ్రమను పెంచాలి.
ధూమపానం నిషేధించాలి.
18 ఏళ్లలోపు వారికి ధూమపానం, మద్యం అమ్మకాలను నియంత్రించాలి.
ప్రమాదకరమైన నొప్పి నివారణ మందులను నిషేధించాలి.
వీటన్నింటిని ఫాలో అయితే గుండెపోటు ముప్పు కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.