మావోయిస్ట్ దళ సభ్యుడుహిడ్మా అరెస్ట్

Update: 2025-05-29 10:43 GMT

ఒడిషా రాష్ట్రంలో మావోయిస్ట్ కార్యకలాపాలు నిర్వహించే కీలక దళ సభ్యుడు కుంజా హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఏకే 47తో పాటు మరికొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇదే పేరుతో చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దండకారాణ్యం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మరో హిడ్మా కూడా ఉన్నాడు. ఇతని పూర్తి పేరు మడివి హిడ్మా. మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలక నేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1కి కమాండర్ గా వ్యవహరిస్తున్నారు. పోలీసుల జాబితాలో ఈ మడివి హిడ్మా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా నమోదై ఉన్నాడు. ఇతనిపై దాదాపు 40 లక్షల రివార్డ్ ఉంది. 2021 మార్చిలో హిడ్మా ఆధ్వర్యంలో దండకారణ్యంలో మాటు వేసి 22 మంది భద్రతా బలగాలను హతమార్చారు. ఎంతో కాలంగా మడివి హిడ్మాను పట్టుకోవాలని చత్తీస్ ఘడ్ పోలీసులు గాలింపు నర్వహిస్తున్నారు. అయితే ఒడిషా పోలీసులు హిడ్మాను అరెస్ట్ చేశారనే వార్తలు రావడంతో అతను మడివి హిడ్మా అని చాలా మంది భావించారు. దీంతో తాము పట్టుకున్నది ఒడిషా రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించే కుంజా హిడ్మాని అని స్పష్టం చేశారు. కుంజా హిడ్మా, చత్తీస్ ఘడ్ మావోయిస్టు గెరిల్లా ఆర్మీ కమాండర్ గా ఉన్న మడివి హిడ్మాలు వేరు వేరని ఒడిషా పోలీసులు వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News