జూలై 6న ఏపీఎన్ సెట్-2025 ప్రవేశ పరీక్ష

APN SET-2025 for admissions in B.Sc Nursing course;

Update: 2025-06-12 05:16 GMT

ప్రపంచ వ్యాప్తంగా నర్సింగ్ కు మంచి ఉపాధి అవకాశాలు, ఆదరణ ఉన్నాయని నర్సింగ్ కోర్సు చేసేవారికి ఇదొక మంచి అవకాశమని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఙాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలియజేశారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఙాన విశ్వ విద్యాలయం ఆవరణలో ఉదయం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ మాట్లాడుతూ నేను 12 వ వైస్ చాన్స్ లర్ గా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఙాన విశ్వ విద్యాలయం కు వచ్చానన్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సు లో అడ్మిషన్లకు ప్రత్యేక ఎంట్రన్స్ పరీక్ష (APNCET-2025) నిర్వహించాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తెలియజేసిందని అందుకు అనుగుణంగా మే 27, 2025 న నోటిపికేషన్ విడుదల చేసామన్నారు. జూలై 6, 2025 ఏపీఎన్ సెట్ – 2025 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సులో 2025-26 సంవత్సరం ప్రవేశాలకుగాను డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఙాన విశ్వ విద్యాలయం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ధరఖాస్తులను 28.05.2025 నుండి 20.06.2025 వరకు స్వీకరిస్తున్నామన్నారు. చివరి రోజు 20.06.2025 న ఆన్ లైన్ ధరఖాస్తులను సాయంత్రం 6 గంటల వరకు స్వీకరిస్తామన్నారు. గతంలో ఈఏపీఎమ్ సెట్ (EAPCET) ఫలితాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జరిగేదన్నారు. రాష్ట్రంలో 13,710 నర్సింగ్ సీట్లు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయన్నారు. ఇప్పటికే 5 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, మున్ముందు ఇవి 15000 వరకు పెరుగుతాయని ఆశిస్తున్నామన్నారు. జూలై 1 న బీసీ రాయ్ దినోత్సవం సందర్శంగా పాటించే జాతీయ డాక్టర్ల దినోత్సవం నాడు పది మంది ఉత్తమ సేవలు అందించిన డాక్టర్లకు అవార్డులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా వస్తారన్నారు.

యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి. రాధికా రెడ్డి మాట్లాడుతూ నర్సింగ్ కు ప్రత్యేక ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో నర్సుల కొరత మనకు చాలా ఉందని, ఇక్కడ నర్సింగ్ కోర్సు చేసి చాలామంది విదేశాల్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా అక్కడ పనిచేయడానికి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలకు, జర్మనీ దేశాలకు వెళ్లుతున్నారన్నారు. సంవత్సరానికి 3 లక్షల వరకు ఆదాయం వీరికి వస్తుందన్నారు. నర్సింగ్ లో ఇతర దేశాల్లో అధిక జీతాలకు మన విద్యార్ధులు పని చేస్తున్నారన్నారు.. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో ఇతర దేశాల భాషలు కూడా నేర్పిస్తున్నారన్నారు. నర్సింగ్ సెట్ లో 100 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఇంగ్లీషు, నర్సింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులుగా ఎంట్రన్స్ పరీక్ష ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల వారు కూడా దరఖాస్తు చేస్తారు కనుక 15 వేల వరకు అప్లికేషన్స్ వస్తాయన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 1000 మందికి 3 మంది నర్సులు ఉండాలని, మన దేశంలో 1.9 మంది నర్సులు (దాదాపు 2 మంది) మాత్రమే ఉన్నారన్నారు.. నర్సింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సీహెచ్.శ్రీనివాసరావు మాట్లాడుతూ నర్సింగ్ పరీక్ష 100 మార్కులకు తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఉంటుందని ఏ భాషలో అయినా రాయొచ్చన్నారు. ఇంటర్మీడీయెట్ లెవల్లో ఒక్కో సబ్జెక్ట్ కు 20 మార్కులు చొప్పున బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, నర్సింగ్ కు సంబంధించి రాష్ట్ర, సెంట్రల్ సిలబస్ నుంచి ప్రశ్నలు ఉంటాయని, నెగిటివ్ మార్కులు లేవన్నారు. కంప్యూటర్ అలవాటు లేనివారికి వారం రోజుల పాటు మాక్ టెస్ట్స్ నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ http://drntr.uhsap.in/ ను సంప్రదించి, ధరఖాస్తు చేయొచ్చు.

Tags:    

Similar News