పోలవరం సందర్శించిన సిడబ్ల్యూసి బృందం

Central water commission(CWC) team visits Polavaram project;

Update: 2025-06-14 10:51 GMT

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని శనివారం కేంద్ర జలసంఘం బృందం సందర్శించింది. జలసంఘం సభ్యుడు యోగేష్ పైథాంకర్ చీఫ్ ఇంజనీర్ హెచ్ ఎస్ సెనేగర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్లతో కూడిన బృందం ప్రాజెక్ట్ సందర్శించింది.

పోలవరం ప్రాజెక్ట్ లో జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, బాట్రస్ డామ్, గ్యాప్ 1 పనులు, ఎగువ, దిగువ కాఫర్ డామ్,స్పిల్ వే లను బృందం పరిశీలించింది. బట్రస్ డామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ తీరు గురించి జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను వారు కోరారు .కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేస్తున్నాయని జలవరుల శాఖ అధికారులు వివరించారు.

ఈ బృందం వెంట పోలవరం ఈఎన్సి కే నరసింహమూర్తి, ఈఈలు డి శ్రీనివాస్, కే బాలకృష్ణ, డిఈలు అనీల్ కుమార్, శ్రీరాం పటేల్,మల్లికార్జున్, ఏఈఈలు అనీల్ కుమార్, పద్మ కుమార్, సురేష్, అరుణ్, కుమారస్వామి, పోలవరం ప్రాజెక్టు ఎం ఈ ఐ ఎల్ జిఎం గంగాధర్, డిజిఎం మురళి పమ్మి , పాండే, వెంకటేష్ ఉన్నారు.

Tags:    

Similar News