Badminton World Championship : 17 ఏళ్ల తర్వాత..ఢిల్లీలో బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్

ఢిల్లీలో బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్

Update: 2025-09-02 05:38 GMT

17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశంలో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు జరగనున్నాయి. 2026లో జరగబోయే ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌కు ఢిల్లీ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. గతంలో 2009లో హైదరాబాద్‌లో ఈ టోర్నమెంట్ నిర్వహించబడింది.2025 పారిస్ ఛాంపియన్‌షిప్స్ ముగింపు వేడుకల సందర్భంగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

Badminton World Championship : అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్రపంచంలో భారత్ ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగింది. పి.వి. సింధు వంటి క్రీడాకారులు సాధించిన విజయాలు, ఇటీవల సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ప్రదర్శనతో భారత్ ప్రతిష్ట మరింత పెరిగింది. ఈ కారణంగా, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌కు మళ్లీ ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కింది.

భారతదేశంలో ఈ టోర్నమెంట్ జరగడం భారతీయ క్రీడాకారులకు గొప్ప అవకాశం. సొంత గడ్డపై ప్రేక్షకుల మద్దతుతో వారు మెరుగైన ప్రదర్శన కనబరిచి పతకాలు గెలుచుకోవాలని ఆశిద్దాం. గతంలో ప్రకాష్ పడుకోనే, పీ.వి. సింధు, సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారులు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించి భారతదేశానికి గౌరవం తెచ్చారు.

Tags:    

Similar News