Good News for Indian Cricket Fans: భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇంగ్లాండ్ సిరీస్ టైమింగ్స్ చేంజ్..

ఇంగ్లాండ్ సిరీస్ టైమింగ్స్ చేంజ్..

Update: 2026-06-09 08:27 GMT

Good News for Indian Cricket Fans: జులై 1 నుంచి ప్రారంభం కానున్న భారత్-ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్. ఈ పర్యటనలో టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. అయితే, భారత్‌లోని టెలివిజన్ వీక్షకుల సౌలభ్యం కోసం.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో కీలక మార్పులు చేసింది.

ముందుగా టీ20 సిరీస్ విషయానికి వస్తే.. షెడ్యూల్ ప్రకారం రెండో టీ20 మినహా మిగతా మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 11:00 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ భారత అభిమానుల కోసం ఈ సమయాన్ని ఒక గంట ముందుకు జరిపారు. దీనితో 1, 3, 4, 5వ టీ20 మ్యాచ్‌లు రాత్రి 10:00 గంటలకే ప్రారంభం కానున్నాయి. అయితే రెండో టీ20 సమయం మారలేదు.. అది యథావిధిగా రాత్రి 7:00 గంటలకే మొదలవుతుంది.

ఇక వన్డే సిరీస్ టైమింగ్స్‌లోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తొలి వన్డే నిజానికి సాయంత్రం 5:30కు ప్రారంభం కావాల్సి ఉండగా.. దానిని రెండు గంటలు ముందుకు జరిపి సాయంత్రం 3:30 గంటలకే మార్చారు. ఇక రెండు, మూడో వన్డేల సమయాల్లో ఎలాంటి మార్పులు లేవు. రెండో వన్డే సాయంత్రం 5:30 గంటలకు, మూడో వన్డే సాయంత్రం 3:30 గంటలకు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. కాగా, ఈ వన్డే సిరీస్‌కు క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందంటే.. మూడు మ్యాచ్‌ల టికెట్లన్నీ ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి!

ఇదిలా ఉంటే, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయంతో బాధపడుతుండటం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ముగిసిన వెంటనే.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు సంబంధించిన పూర్తి భారత జట్టును బీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.

Tags:    

Similar News