IND vs SL 2nd Test: క్రికెట్ ప్రియులకు మళ్లీ వరుణుడి రూపంలో నిరాశ ఎదురైంది, కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. మ్యాచ్ రెండో రోజు ఆటలో భాగంగా.. భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో పటిష్ట స్థితిలో కొనసాగుతున్న తరుణంలో ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో కమ్ముకుంది. దీంతో అంపైర్లు నిర్ణీత సమయం కంటే ముందే టీ (Tea) విరామాన్ని ప్రకటించాల్సి వచ్చింది.

వర్షం ఎక్కువ కావడంతో గ్రౌండ్ సిబ్బంది అప్రమత్తమై.. పిచ్‌తో పాటు ఎంటైర్ అవుట్‌ఫీల్డ్‌ను వేగంగా కవర్లతో కప్పేశారు. ఆట నిలిచిపోయే సమయానికి టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. లంచ్ విరామం తర్వాత రిషభ్ పంత్ (63 పరుగులు) వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కాగా.. మరోవైపు యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఆటతీరుతో సెంచరీకి చేరువగా (95 పరుగులతో నాటౌట్) క్రీజులో నిలిచాడు. ఆయనకు తోడుగా మహమ్మద్ సిరాజ్ ఉన్నారు.ప్రస్తుతానికి వర్షం కారణంగా ఆట తాత్కాలికంగా నిలిచింది. వాతావరణం మెరుగుపడి మ్యాచ్ త్వరలోనే మళ్లీ ప్రారంభమవుతుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.

Tags: