World Chess Battle: ప్రపంచ చెస్ సమరం.. టైటిల్ వేటలో భారత దిగ్గజాలు..

టైటిల్ వేటలో భారత దిగ్గజాలు..

Update: 2025-12-25 07:12 GMT

World Chess Battle: ఏడాది ముగింపు వేళ చెస్ ప్రియులకు కనువిందు చేసే ఫిడే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ నేడు ఘనంగా ప్రారంభం కానుంది. ప్రపంచ స్థాయి మేటి క్రీడాకారులు తలపడే ఈ మెగా టోర్నీలో సత్తా చాటేందుకు భారత గ్రాండ్‌మాస్టర్లు సిద్ధమయ్యారు. రెండు సార్లు ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచిన హంపి, ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని చాటి టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. మహిళల విభాగంలో ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన దివ్య, ఈ టోర్నీలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

గుకేశ్‌కు పునరాగమన అవకాశం

ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత యువ సంచలనం దొమ్మరాజు గుకేశ్, ఈ ఏడాదిని ఘనంగా ముగించేందుకు ఈ టోర్నీని ఒక చక్కని వేదికగా భావిస్తున్నాడు. అతనితో పాటు ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి, నిహాల్ సరీన్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా బరిలో ఉన్నారు.

దిగ్గజాలతో పోరు

భారత ఆటగాళ్లకు ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారుల నుండి గట్టి పోటీ ఎదురుకానుంది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్, ఫాబియానో కరువానా, వెస్లీ సో, నెపోమ్నియాషి వంటి వారితో పోటీ పడనున్నారు. ఈసారి ఓపెన్ విభాగంలో భారత్ నుంచి రికార్డు స్థాయిలో 29 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతుండడం విశేషం.

Tags:    

Similar News