Pochampally: పోచంపల్లి సందర్శించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
సందర్శించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ;
Pochampally: గురువారం రాష్ట్ర గవర్నర్ విశ్వ దేవ్ వర్మ తన సతీమణి సుధా దేవ్ వర్మతో కలిసి పోచంపల్లి పర్యటించారు. ఇక్కడ తయారయ్యే ఇక్కత్ వస్త్రాలు కేవలం చేనేత ఉత్పత్తులు మాత్రమే కాదని, అవి దేశ సాంస్కృతిక చిహ్నాలని గవర్నర్ కొనియాడారు. అహ్మదాబాద్లోనే ఎన్ ఐ డి(NID), ఐ ఐ టి(IIT) ల సహకారంతో అధ్యయనం చేసేందుకు మరియు వీటికి మరింత ప్రాచుర్యం, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో గవర్నర్ వెంట భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ పర్యటనలో ముందుగా గవర్నర్ దంపతులు వినోబా భావే మందిరం వీధిలో ఉన్న గృహాలను సందర్శించి వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం ఇక్కడ మ్యూజియంలో కార్మికులు పనిచేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. తర్వాత చేనేత కార్మికులతో సమావేశ మందిరంలో ముఖాముఖి నిర్వహించారు. ఇక్కత్ వస్త్రాల గురించి 'మా సొంత రాష్ట్రం. త్రిపురలో ఉన్నప్పుడు తరచుగా వినేవాళ్ళం. పోచంపల్లిలో కార్మికులు చీరలు చేతితో నేస్తారని, అవి మంచి నాణ్యతతో కలిగి ఉంటాయని చెబుతుంటారు. ఉత్తరాదిలో ఇంత నైపుణ్యం గల చేనేత కార్మికులు తక్కువే' అని గవర్నర్ అన్నారు. చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న నేతన్న భరోసా, త్రిఫ్ట్, భీమా పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, కేంద్రం ఈ పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలుకు వారి దృష్టికి తీసుకెళతామన్నారు. పోచంపల్లి వస్త్రాలను ప్రపంచ సుందరి పోటీదారులు ఫ్యాషన్ షో లో ప్రదర్శించడంద్వారా. 30% అమ్మకాలు పెరిగాయంటూ కార్మికులు తనతో చెప్పారని, ఇది మంచి పరిణామమని తెలిపారు. ఈ పర్యటనలో గవర్నర్ నేతన్న రుణాల కింద ముగ్గురు కార్మికులకు రూ.5,00,000 విలువైన చెక్కులను అందజేశారు. యాదాద్రి జిల్లాకు నేతన్న పొదుపు పథకం ద్వారా రూ.2.71 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి. శైలజా రామయ్యర్, ఏ డి శ్రీనివాసరావు, కలెక్టర్ హనుమంత రావు, భువనగిరి డీసీపీ ఆకాంక్ష యాదవ్ పాల్గొన్నారు.