Mahindra : కొత్త కారు కొనేవారికి శుభవార్త.. ఎక్స్‌యూవీ 700పై అదిరిపోయే ఆఫర్!

ఎక్స్‌యూవీ 700పై అదిరిపోయే ఆఫర్!

Update: 2025-09-19 04:40 GMT

Mahindra : భారత ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుంచి జీఎస్‌టీ 2.0 విధానంలో భాగంగా కార్ల ధరలపై ఉన్న సెస్ తొలగించింది. ఈ నిర్ణయం ఆటోమొబైల్ పరిశ్రమపై సానుకూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా, అనేక వాహనాల ధరలు తగ్గనున్నాయి. మహీంద్రా సంస్థ ఈ ధరల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించడానికి సెప్టెంబర్ 6 నుంచే తగ్గింపు ధరలను ప్రకటించింది.

మహీంద్రా తన ప్రముఖ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 700పై మోడల్‌ను బట్టి ధరలను తగ్గించింది. కంపెనీ ఇప్పటికీ ప్రతి వేరియంట్ కచ్చితమైన కొత్త ధరలను వెల్లడించలేదు, కానీ కస్టమర్లు తమకు ఎంత ఆదా అవుతుందో స్పష్టంగా వివరించింది. ఇది కేవలం అంచనా మాత్రమేనని, కచ్చితమైన ధర కోసం దగ్గరలోని మహీంద్రా షోరూమ్‌ను సంప్రదించాలని కంపెనీ తెలిపింది.

ప్రతి మోడల్‌పై ఎంత తగ్గింపు లభించిందంటే:

* MX: రూ. 88,900 తగ్గింపు.

* AX3: రూ. 1,06,500 తగ్గింపు.

* AX5 S: రూ. 1,10,200 తగ్గింపు.

* AX5: రూ. 1,18,300 తగ్గింపు.

* AX7: రూ. 1,31,900 తగ్గింపు.

* AX7 L: రూ. 1,43,000 తగ్గింపు.

ట్యాక్స్ ఎంత తగ్గింది?

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 అనేది 4000 మి.మీ. పొడవు, 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ఎస్‌యూవీ. ఇంతకు ముందు ఈ కార్లపై 28 శాతం జీఎస్‌టీ, 20 శాతం సెస్ కలిపి మొత్తం 48 శాతం ట్యాక్స్ ఉండేది. కొత్త జీఎస్‌టీ విధానంలో సెస్ తొలగించడంతో, ఇప్పుడు ఈ కార్లపై కేవలం 40 శాతం జీఎస్‌టీ మాత్రమే ఉంటుంది. దీనివల్ల వినియోగదారులకు మొత్తం 8 శాతం ఆదా అవుతుంది. ప్రస్తుతం మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 14.49 లక్షల నుంచి రూ. 25.89 లక్షల వరకు ఉన్నాయి.

Tags:    

Similar News