PM Kisan : ఏపీ రైతులకు డబుల్ బొనాంజా.. వారి అకౌంట్లలో రూ.2000వేలకు బదులు రూ.7000

వారి అకౌంట్లలో రూ.2000వేలకు బదులు రూ.7000;

Update: 2025-08-04 06:10 GMT

PM Kisan : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత డబ్బులు దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈసారి కేంద్ర ప్రభుత్వం రూ.2000 చొప్పున సుమారు రూ.20,500 కోట్లను 9.7 కోట్ల మంది రైతులకు బదిలీ చేసింది. అయితే ఈసారి ఏపీలోని రైతులకు మాత్రం రూ.2000 మాత్రమే కాకుండా, ఏకంగా రూ.7000 జమ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈసారి పీఎం కిసాన్ డబ్బులు మరింత ప్రత్యేకంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పీఎం కిసాన్ పథకంతో పాటు, తన సొంత పథకాన్ని కూడా కలిపి అమలు చేస్తోంది. ఆ పథకం పేరు అన్నదాత సుఖీభవ. ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.20,000 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5000, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2000 చొప్పున మొత్తం రూ.7000 నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇలా ఆంధ్రప్రదేశ్‌లోని 46,85,838 మంది రైతులకు ఒకేసారి రూ.7000 మొత్తం అందింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఒక వాగ్దానంగా చేర్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, రైతుల పరిస్థితిని మెరుగుపరచడానికి ఈ పథకం చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్య రైతులకు స్వయం సమృద్ధిని, సాధికారతను కల్పిస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు.

మీ ఖాతాలో డబ్బులు రాకపోతే ఏం చేయాలి?

* మీరు పీఎం కిసాన్ లబ్ధిదారులై ఉండి, మీ ఖాతాలో ఇంకా రూ.2000 జమ కాకపోతే, మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తనిఖీ చేసుకోవాలి.

* మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌తో pmkisan.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లండి.

* అక్కడ Beneficiary Status విభాగంలోకి వెళ్లి మీ స్థితిని తనిఖీ చేసుకోండి.

* ఏదైనా లోపం ఉంటే, మీ స్థానిక వ్యవసాయ అధికారిని లేదా సీఎస్సీ కేంద్రాన్ని సంప్రదించండి.

కేంద్రం, ఏపీ ప్రభుత్వం రెండూ రైతుల కోసం భవిష్యత్తులో కూడా మరిన్ని విడతల కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశాయి. కేంద్రం ప్రతి నాలుగు నెలలకు రూ.2000 బదిలీ చేస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతి కొన్ని నెలలకు తన వాటాగా రూ.5000 ఇవ్వనుంది. అంటే ఇకపై రైతులకు సంవత్సరానికి రూ.20,000 వరకు ఆర్థిక సహాయం అందనుంది.

Tags:    

Similar News