Sri Padmavathi Ammavari Brahmotsavams: నవంబరు 16న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Sri Padmavathi Ammavari Brahmotsavams: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 16వ తేదీ అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు.
నవంబరు 17న ధ్వజారోహణం
ఆలయంలో నవంబరు 17న ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ధ్వజస్తంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ
17-11-2025
ఉదయం – ధ్వజారోహణం ( ధనుర్ లగ్నం)
రాత్రి – చిన్నశేషవాహనం
18-11-2025
ఉదయం – పెద్దశేషవాహనం
రాత్రి – హంసవాహనం
19-11-2025
ఉదయం – ముత్యపుపందిరి వాహనం
రాత్రి – సింహవాహనం
20 -11-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – హనుమంత వాహనం
21 -11-2025
ఉదయం – పల్లకీ ఉత్సవం
రాత్రి – గజవాహనం
22-11-2025
ఉదయం – సర్వభూపాలవాహనం
సమయం – స్వర్ణరథం,
రాత్రి – గరుడవాహనం
23-11-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
24-11-2025
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వ వాహనం
25-11-2025
ఉదయం – పంచమీతీర్థం
రాత్రి – ధ్వజావరోహణం.