Ayyappa Devotees Traveling to Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త.. 60 ప్రత్యేక రైళ్లు
60 ప్రత్యేక రైళ్లు
Ayyappa Devotees Traveling to Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి కేరళలోని శబరిమలకు సమీప స్టేషన్లైన కొల్లాం (Kollam) మరియు కొట్టాయం వరకు నడిపేందుకు వీలుగా 60 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ మధ్య వారం నుండి ప్రారంభమై, మకర జ్యోతి పండుగను దృష్టిలో ఉంచుకుని జనవరి 2026 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ మధ్య వారం నుండి ప్రారంభమై, మకర జ్యోతి పండుగను దృష్టిలో ఉంచుకుని జనవరి 2026 వరకు అందుబాటులో ఉండనున్నాయి.
ఈ ప్రత్యేక రైళ్లు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో కొన్ని ముఖ్యమైనవి:
తెలంగాణ: చర్లపల్లి (కొన్ని సర్వీసులు), నల్గొండ, మిర్యాలగూడ.
ఆంధ్రప్రదేశ్: మచిలీపట్నం, నర్సాపూర్, విజయవాడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట.
కేరళకు చేరుకున్నాక కొట్టాయం, చెంగనూరు వంటి స్టేషన్లలో ఆగుతాయి.