TTD: తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 20 గంటల సమయం

దర్శనానికి 20 గంటల సమయం;

Update: 2025-06-07 05:19 GMT

TTD:వేసవి సెలవులు మరో 5 రోజుల్లో ముగియనున్నాయి. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. శ్రీవారి దర్శనం 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని 72,174 మంది భక్తులు దర్శించుకోగా 35,192 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

మరోవైపు శ్రీవారి మెట్టుమార్గం నుంచి తిరుమల వెళ్లే భక్తులకు తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఎస్‌ఎస్‌డీ టోకెన్ల పంపిణీ ప్రక్రియను టీటీడీ శుక్రవారం ప్రారంభించింది. ఇందుకు అధికారులు 10 కౌంటర్లతో పాటు అదనంగా 4 కౌంటర్లు ఏర్పాటుచేశారు. శ్రీవారి మెట్టుమార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులకు 5 కౌంటర్లలో సాయంత్రం 5 గంటల నుంచి దివ్యదర్శనం టోకెన్లు అందజేశారు. మిగిలిన 9 కౌంటర్లలో సర్వదర్శన టోకెన్లు అందజేసేలా చర్యలు తీసుకున్నారు.

Tags:    

Similar News