Tulsi and Ginger Tea: తులసి, అల్లం టీతో వైరల్ జ్వరాలకు చెక్.. మారుతున్న వాతావరణంలో మీ రక్షణ మీ చేతుల్లోనే..

మారుతున్న వాతావరణంలో మీ రక్షణ మీ చేతుల్లోనే..

Update: 2026-04-17 14:57 GMT

Tulsi and Ginger Tea: దేశంలోని అనేక రాష్ట్రాల్లో వాతావరణం దోబూచులాడుతోంది. పగలు మండుతున్న ఎండలు, సాయంత్రం వేళ అకస్మాత్తుగా వర్షాలు.. ఈ వింత మార్పులు మన శరీర రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తున్నాయి. వాతావరణంలో సంభవిస్తున్న ఈ ఆకస్మిక మార్పుల వల్ల జలుబు, జ్వరం, జీర్ణ సంబంధిత సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దోషాల సమతుల్యత దెబ్బతింటే..

ఆయుర్వేదం ప్రకారం.. వాతావరణం ఒక్కసారిగా మారినప్పుడు శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాల సమతుల్యత తప్పుతుంది.

వైరల్ ఇన్ఫెక్షన్లు: దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు త్వరగా దరిచేరుతాయి.

జీర్ణ సమస్యలు: మారుతున్న ఉష్ణోగ్రతల వల్ల జీర్ణక్రియ మందగించి కడుపులో అసౌకర్యం కలుగుతుంది.

అలర్జీలు: గాలిలో తేమ, దుమ్ము వల్ల చర్మం, ఊపిరితిత్తుల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

ఏం తినాలి? ఎలా జాగ్రత్తపడాలి?

డాక్టర్ చంచల సూచనల ప్రకారం.. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.

తేలికపాటి ఆహారం: జీర్ణం కావడానికి సులభంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బొప్పాయి, దానిమ్మ, నారింజ వంటి పండ్లు శరీరానికి శక్తినిస్తాయి.

హెర్బల్ టీలు: అల్లం, తులసి కలిపిన టీ తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఆయుర్వేద మూలికలు: అశ్వగంధ, తిప్పతీగ, తులసి వంటివి శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి.

జంక్ ఫుడ్‌కు నో: నూనెలో వేయించిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్ ఈ సమయంలో పైత్యాన్ని, కఫాన్ని పెంచుతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

ముఖ్యమైన సూచనలు:

గోరువెచ్చని నీరు: ఫ్రిజ్‌లోని చల్లటి నీటికి బదులుగా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని లేదా కొద్దిగా గోరువెచ్చని నీటిని తాగడం ఉత్తమం.

ఎండ నుండి రక్షణ: మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లకండి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా గొడుగు వాడండి.

Tags:    

Similar News