DSP Suspended in Uttar Pradesh: యూపీలో డీఎస్పీ సస్పెండ్: రూ.100 కోట్ల బినామీ ఆస్తులు సేకరణపై విజిలెన్స్ దర్యాప్తు!
రూ.100 కోట్ల బినామీ ఆస్తులు సేకరణపై విజిలెన్స్ దర్యాప్తు!
DSP Suspended in Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని మెయిన్పూరి జిల్లా భోగావోంలో పోస్ట్లో ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) రిషికాంత్ శుక్లకు విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభమైంది. కాన్పూర్లోని అఖిలేష్ దుబే గ్యాంగ్తో సంబంధాలు, రూ.100 కోట్లకు పైగా బినామీ ఆస్తులు సేకరించినందుకు అతన్ని ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) రిషికాంత్ శుక్లాను అక్రమ బినామీ ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలతో సస్పెండ్ చేశారు. మెయిన్పూరి జిల్లాలోని భోగావ్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శుక్లా, రూ.100 కోట్లకు పైగా విలువైన అక్రమ ఆస్తులను సేకరించినట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. కాన్పూర్కు చెందిన అవినీతి నిందితుడు అఖిలేష్ దూబే కేసు దర్యాప్తులో శుక్లా పేరు బయటపడటంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) సోదాలు నిర్వహించింది. ఈ దర్యాప్తు ఫలితంగా అతని అక్రమ కార్యకలాపాలు బయటపడ్డాయి.
దూబే మాఫియాతో సన్నిహిత సంబంధాలు
1998 నుంచి 2009 వరకు కాన్పూర్లో విధులు నిర్వహించిన రిషికాంత్ శుక్లా, ఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయికి ఎదిగినప్పటికీ అవినీతి మార్గాల్లోనే మునిగిపోయాడు. భూకబ్జా మాఫియా, దోపిడీ గ్యాంగ్లతో చేతులు కలిపి తప్పుడు కేసులు బనాయించడం, సెటిల్మెంట్లు చేసుకోవడం వంటి కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అఖిలేష్ దూబే ముఠాతో సన్నిహితంగా ఉండి, భూమి కబ్జాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో అక్రమ పెట్టుబడులు పెట్టి నల్ల ధనాన్ని తెల్లగా మార్చుకున్నాడని SIT నివేదికలు తెలిపాయి. బదిలీల తర్వాత కూడా దూబే గ్యాంగ్తో కొనసాగి, కోట్లాది రూపాయల భూమి ఒప్పందాల్లో అతను భాగస్వామి అయ్యాడని ఆరోపణలు ఉన్నాయి.
సోదాల్లో 12 రకాల ఆస్తులు గుర్తింపు
దూబే కేసు దర్యాప్తు దశలో శుక్లా ఇంటిపై SIT సోదాలు నిర్వహించగా, 12 రకాల బినామీ ఆస్తులు బయటపడ్డాయి. వీటిలో రూ.92 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఆస్తులకు డాక్యుమెంట్లు, ఆధారాలు సేకరించారు. మరో మూడు ఆస్తులకు డాక్యుమెంట్లు లేకపోయినా, అతని PAN నంబర్ ఆధారంగా వాటిని గుర్తించారు. ఈ ఆస్తులు భూములు, ఫ్లాట్లు, వాహనాలు, రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు వంటివి. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని కూడా అతను నడుపుతూ, అక్రమ ఆదాయాలను పొందుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
పోలీసు శాఖ నుంచి కఠిన చర్య
ఉత్తరప్రదేశ్ పోలీసు ముఖ్య సీపీ ప్రకాష్ సింగ్, ఈ ఆరోపణలపై తక్షణ చర్యలు తీసుకుని శుక్లాను సస్పెండ్ చేశారు. "పోలీసు శాఖలో అవినీతికి చోటు లేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటాము" అని సీపీ స్పష్టం చేశారు. SIT దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన యూపీ పోలీసు శాఖలో అవినీతి చర్చలకు దారితీసింది. భూకబ్జా మాఫియాతో పోలీసు అధికారుల ముడిపడటం తరచూ జరుగుతున్నా, ఇంత పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులు బయటపడటం అరుదు.