Priyanka Gandhi Casts Her Vote: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రియాంక గాంధీ – క్యూలో నిలబడిన కాంగ్రెస్ నేత

క్యూలో నిలబడిన కాంగ్రెస్ నేత

Update: 2025-09-09 09:49 GMT

Priyanka Gandhi Casts Her Vote: 2025 ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు పార్లమెంటు నూతన భవనంలోని 'ఎఫ్-101 వసుధ'లో ప్రారంభమై, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతోంది. పోలింగ్ చురుకుగా సాగుతున్న మధ్య, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలి ఓటు వేసి, వరద బాధిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌కు బయలుదేరారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల సభ్యులు తమ ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ క్యూలో నిలబడి ఓటు వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేతలు జైరామ్ రమేష్, శశి తరూర్ తమ ఓట్లను వేశారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడా వీల్‌చైర్‌పై పార్లమెంటుకు చేరుకొని ఓటు వేశారు.

కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, చిరాగ్ పాశ్వాన్, కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ వంటి ప్రముఖులు కూడా తమ ఓటు హక్కులను అభ్యాసం చేసుకున్నారు.

కాగా, వివిధ కారణాలతో ఓటింగ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), బిజూ జనతాదళ్ (బీజేడీ), శిరోమణి అకాలీ దళ్ (ఎస్‌ఏ‌డి) ప్రకటించాయి. బీఆర్ఎస్‌కు రాజ్యసభలో 4 మంది ఎంపీలు, బీజేడీకి 7 మంది, ఎస్‌ఏ‌డికి 1 మంది ఎంపీ ఉన్నారు.

Tags:    

Similar News