మెట్రో ప్రయాణీకులకు ఉపశమనం
Ten percent discount on metro rail fares in Hyderabad;
హైదరాబాద్ మెట్రో చార్జీలపై ఎల్ అండ్ టి సంస్థ దిగొచ్చింది. దేశంలోనే అన్ని నగరాల కన్నా మెట్రో చార్జీలు హైదరాబాద్ లోనే తక్కువగా ఉన్నాయని ఊదరగొట్టిన మెట్రో యాజమాన్యం అమాంతం చార్జీలు పెంచింది. భారత దేశంలో అన్ని నగరాల కన్నా తక్కువగా కలకత్తా మెట్రో చార్జీలు ఉన్నాయి. ప్రయాణీకుల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో ఎల్ అండ్ టీ దిగొచ్చింది.
పెంచిన మెట్రో ఛార్జీలలో 10 శాతం రాయితీ కల్పిస్తూ ఎల్ అండ్ టీ నిర్ణయం తీసుకుంది. ఈ రాయితీలు మే 24వ తేదీ నుంచి వర్తించనున్నాయి. మెట్రో రైలు కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. పెరిగిన మెట్రో ఛార్జీలు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. మెట్రో ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇటీవల పెరిగిన మెట్రో ఛార్జీలు ఇలా..
మొదటి 2 కి.మీ. వరకు రూ. 12
2 నుంచి 4 కి.మీ. వరకు రూ. 18
4 నుంచి 6 కి.మీ. వరకు రూ. 30
6 నుంచి 9 కి.మీ. వరకు రూ. 40
9 నుంచి 12 కి.మీ. వరకు రూ. 50
12 నుంచి 15 కి.మీ. వరకు రూ. 55
15 నుంచి 18 కి.మీ. వరకు రూ. 60
18 నుంచి 21 కి.మీ. వరకు రూ. 66
21 నుంచి 24 కి.మీ. వరకు రూ. 70
24 కి.మీ. నుంచి ఆపై దూరానికి రూ. 75