Asia Cup 2025: జస్‌ప్రీత్ బుమ్రాకు నో రెస్ట్.. మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం!

మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం!

Update: 2025-09-24 06:20 GMT

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భారత్ సూపర్ 4 దశలో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా, ముఖ్యంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిస్తారా లేదా అనే అంశంపై క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇటీవల గాయం నుండి కోలుకుని వచ్చిన బుమ్రాకు టెస్ట్ మ్యాచ్‌లకు ముందు సరైన మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ అతనికి మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుంది. భారత జట్టు మేనేజ్‌మెంట్ ఆసియా కప్‌ను గెలవడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. కాబట్టి, ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తోంది. భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చాట్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం లేదని, రాబోయే టెస్టులకు ఇది మంచి సన్నాహకమని ఆయన తెలిపారు. ఈ ప్లేయింగ్ ఎలెవన్‌తో భారత్ బంగ్లాదేశ్‌ను ఢీకొనే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ జట్టు కూడా శ్రీలంకపై గెలిచి మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.

Tags:    

Similar News