Women's ODI World Cup-2025: భారత్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డ్..

ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డ్..

Update: 2025-10-13 08:50 GMT

Women's ODI World Cup-2025: మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2025లో ఆస్ట్రేలియా జ‌ట్టు జోరు కొన‌సాగుతోంది. భార‌త్‌తో ఆదివారం వైజాగ్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో 331 పరుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించి, ఆసీస్ 3 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

హీలీ విధ్వంసం.. వ‌ర‌ల్డ్ రికార్డు

భారీ టార్గెట్ ఛేద‌న‌లో ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ అద్భుత సెంచ‌రీతో చెల‌రేగింది. 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 142 ప‌రుగులు చేసిన హీలీ, మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించింది. ఫ‌లితంగా ఆస్ట్రేలియా ఈ ల‌క్ష్యాన్ని 49 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. హీలీతో పాటు లీచ్ ఫీల్డ్‌ (40), పెర్రీ (47), గార్డ‌న‌ర్ (45) వంటి కీలక బ్యాటర్లు కూడా రాణించారు.

ఈ విజ‌యంతో ఆస్ట్రేలియా జట్టు మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. అత్యధిక పరుగుల లక్ష్యాన్ని (331) ఛేదించిన జట్టుగా ఆసీస్ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట (దక్షిణాఫ్రికాపై 302 పరుగులు) ఉండేది.

మ‌హిళ‌ల వ‌న్డేల్లో హైయిస్ట్ ఛేజింగ్‌లు:

1. ఆస్ట్రేలియా (331/7) vs భారత్ (తాజా మ్యాచ్)

2. శ్రీలంక (302/4) vs దక్షిణాఫ్రికా

3. ఆస్ట్రేలియా (289) vs న్యూజిలాండ్

4. ఆస్ట్రేలియా (283) vs భారత్

5. ఆస్ట్రేలియా (282) vs భారత్

ఈ విజ‌యంతో ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియా జోరును కొన‌సాగిస్తోంది.

Tags:    

Similar News