Bengaluru:ఆర్సీబీపై కేసు..సీఐడీతో ప్రత్యేక బృందంతో దర్యాప్తు
ప్రత్యేక బృందంతో దర్యాప్తు;
Bengaluru:బెంగళూరులోని తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ మేనేజ్మెంట్, కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్పై కబ్బన్ పార్క్ పోలీసులు, సుమోటోగా కేసు నమోదు చేశారు. క్రిమినల్ నెగ్లిజెన్స్ కేసులో ఈ సంస్థలను నిందితులుగా పేర్కొంటూ ,బీఎన్ఎస్ లోని 5 వేర్వేరు సెక్షన్లతో పాటు సెక్షన్ 105 కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం, విక్టరీ పరేడ్ విషయంలో ఆర్సీబీ మేనేజ్మెంట్, కేఎస్సీఏ మొండిగా వ్యవహరించినట్లు పోలీసులు వివరించారు.
బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానందతో పాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న ఇతర పోలీస్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. తొక్కిసలాట కేసును క్రిమినల్ సీఐడీకి అప్పగిస్తూ కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కోర్టుకు ఇచ్చిన స్టేటస్ రిపోర్టులో ఈ విషయాన్ని ప్రభుత్వం పేర్కొన్నది.
మరో వైపు తొక్కిసలాట ఘటనపై కర్నాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టి, ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం మండిపడింది. తొక్కిసలాట ఘటన వెనుక కారణాలను తేల్చాల్సిన అవసరం ఉందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేస్తారో చెప్పాలని నిలదీసింది.