Head Coach Gambhir: జట్టు గెలవనప్పుడు ఎన్ని సెంచరీలు చేస్తే ఏం లాభం.?
ఎన్ని సెంచరీలు చేస్తే ఏం లాభం.?;
Head Coach Gambhir: ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలపై హెడ్ కోచ్ గంభీర్ విభిన్నంగా స్పందించాడు. జట్టు గెలవనప్పుడు ఎన్ని సెంచరీలు చేసినా ఏం లాభం ఉండదన్నాడు. ఈ మ్యాచ్ లో పంత్ రెండింటితో పాటు కేఎల్ రాహుల్, జైశ్వాల్,గిల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అవి కూడా పెద్ద సానుకూలతలే. కానీ జట్టు గెలవనప్పుడు ఈ సెంచరీలతో పెద్దగా పని ఉండదని చెప్పుకొచ్చాడు.
నిజాయితీగా చెప్పాలంటే ఒక మ్యాచ్లో ఐదు సెంచరీలు అనేది గొప్ప ప్రారంభంగా భావిస్తున్నాం. ఈ మ్యాచ్లో వ్యక్తిగత ప్రదర్శనలు బాగున్నా ఫలితం సంతృప్తినివ్వలేదన్నాడు. ఒకవేళ సానుకూలాంశాలే కావాలనుకుంటే యశస్వి, గిల్, రాహుల్ కూడా సెంచరీలు చేశారని చెప్పాలి. అప్పుడు నాకు నచ్చేది. ఒక పంత్ గురించే అడగడం కరెక్ట్ కాదు అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఫస్ట్ టెస్టులో రెండు సెంచరీలు చేసి రికార్డ్ సృష్టించిన పంత్ ఏకంగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఏడోస్థానానికి ఎగబాకాడు. 801 పాయింట్లతో తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. మరో వైపు జైశ్వాల్ 851 స్థానాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు.