India women's national cricket team: ఆసీస్‌తో ఏకైక టెస్టు: భారత మహిళా జట్టు కష్టాల్లో.. 20 పరుగుల వెనుకబడి!

20 పరుగుల వెనుకబడి!

Update: 2026-03-07 14:41 GMT

India women's national cricket team: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో భారత మహిళా జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. రెండో రోజు ఆట ముగిసిన సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 105 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 125 పరుగుల లీడ్ కారణంగా టీమ్ ఇండియా ఇంకా 20 పరుగులు వెనుకబడి ఉంది.

క్రీజ్‌లో ప్రతీకా రావల్ (43 నాటౌట్) నిలకడగా ఆడుతూ జట్టును కాపాడుతోంది. ఆమెతో పాటు స్నేహ రాణా (14 నాటౌట్) ఉన్నారు. అయితే ఓపెనర్లు స్మృతి మందాన (2), షెఫాలీ వర్మ (5) త్వరగా ఔటవడంతో భారత్ షాక్‌కు గురైంది. జెమీమా రోడ్రిగ్స్ (14), హర్మన్‌ప్రీత్ కౌర్ (11), దీప్తి శర్మ (9) కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. రిచా ఘోష్ (0) డకౌట్‌గా పెవిలియన్ చేరింది.

ఆస్ట్రేలియా బౌలర్లు దెబ్బకు భారత్ వికెట్లు సమష్టిగా కోల్పోయింది. లూసీ హామిల్టన్ 3 వికెట్లు, అన్నాబెల్ సదర్లాండ్ 2 వికెట్లు, డార్సీ బ్రౌన్ 1 వికెట్ తీశారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 323 పరుగులకు ఆలౌటైంది. అన్నాబెల్ సదర్లాండ్ (129) సెంచరీ సాధించగా, ఎల్లీస్ పెర్రీ (76) హాఫ్ సెంచరీతో ఆసీస్‌ను బలోపేతం చేశారు. భారత్ తరపున సయాలి సత్ఘరే 4 వికెట్లు పడగొట్టింది.

టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్ (52) హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అయితే ఆసీస్ బౌలర్లు అన్నాబెల్ సదర్లాండ్ (4/46), లూసీ హామిల్టన్ (3/31) దెబ్బకు భారత్ బ్యాటింగ్ కుదేలైంది.

మూడో రోజు ఆట ప్రారంభమైనప్పుడు ప్రతీకా, స్నేహ రాణాలు జట్టును ఆదుకోవాల్సిన బాధ్యతలో ఉన్నారు. ఆస్ట్రేలియా మ్యాచ్‌పై గట్టి పట్టు సాధించినట్లు కనిపిస్తోంది. భారత మహిళా జట్టుకు ఈ టెస్టులో విజయం సాధించడం కష్టతరంగా మారింది.

Tags:    

Similar News