Chennai Super Kings: చెన్నై ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. 2 వారాలు ధోనీ దూరం
2 వారాలు ధోనీ దూరం
Chennai Super Kings: క్రికెట్ పండుగ ఐపీఎల్ వచ్చేసింది. స్టేడియాలు విజిల్స్తో హోరెత్తే సమయం ఆసన్నమైంది. కానీ, తొలి మ్యాచ్కి ముందే చెన్నై సూపర్ కింగ్స్ కోటలో ఒక కలకలం రేగింది. కోట్లాది మంది అభిమానులు ఎవరి కోసం అయితే టీవీల ముందు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది.
ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు ఎం.ఎస్. ధోనీ దూరం కానున్నారు. కండరాల గాయం (Muscle Injury) కారణంగా ఆయన తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. గతేడాది కూడా మోకాలి గాయంతోనే ఆడి జట్టును ఛాంపియన్గా నిలబెట్టిన ధోనీకి, ఇప్పుడు మళ్ళీ అదే తరహా సమస్య ఎదురవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి రెండు వారాల పాటు ఆయన మైదానంలో కనిపించే అవకాశం లేదని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం ధోనీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. గాయం తీవ్రత దృష్ట్యా, టోర్నీ మధ్యలో సమస్య పెద్దది కాకూడదనే ఉద్దేశంతో ఆయనకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. చెన్నై టీమ్ మేనేజ్మెంట్ దీనిపై స్పందిస్తూ.. "ధోనీ మాకు కేవలం ఆటగాడు మాత్రమే కాదు, మా బలం. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం" అని పేర్కొంది. దీంతో ధోనీ కీపింగ్, బ్యాటింగ్ ఫినిషింగ్ను మిస్ అవుతున్నామన్న బాధలో అభిమానులు ఉన్నారు.
గతంలో ఎన్నో కష్టకాలాల్లో జట్టును ముందుండి నడిపించిన ధోనీ, ఈ సారి డ్రెస్సింగ్ రూమ్ నుంచి సలహాలు ఇస్తూ జట్టును గైడ్ చేయనున్నారు. ఐపీఎల్ ప్రారంభం అవుతున్న వేళ ఇది సీఎస్కేకు పెద్ద ఎదురుదెబ్బే అయినప్పటికీ, ధోనీ త్వరగా కోలుకుని 'చెపాక్' స్టేడియంలో హెలికాప్టర్ షాట్లతో అలరించాలని కోరుకుందాం.