Kochi Tuskers Kerala: ఐపీఎల్లో కొచ్చి టాస్కర్స్.. అప్పట్లో జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..?

అప్పట్లో జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..?;

Update: 2025-06-19 11:23 GMT

Kochi Tuskers Kerala:  13ఏళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి అడుగుపెట్టిన జట్టు కొచ్చి టాస్కర్స్ కేరళ మళ్ళీ వార్తల్లో నిలిచింది. బీసీసీఐకి సంబంధించిన కేసు కారణంగా ఇది మళ్లీ వెలుగులోకి వచ్చింది. 2011లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన కొచ్చి టస్కర్స్ కేరళ జట్టును 2012లో నిషేధించారు. కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీ మొదటి సీజన్‌లోనే ఫ్రాంచైజ్ ఫీజులో భాగమైన 10 శాతం బ్యాంక్ గ్యారెంటీని చెల్లించడంలో విఫలమైంది. దీంతో ఆ ఫ్రాంచైజీని IPL నుండి తొలగించారు.

ఈ బీసీసీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా కొచ్చి ఫ్రాంచైజీ 2012లో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు తాజాగా కీలక మైన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు ప్రకారం..బీసీసీఐ కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంచైజీ యజమానులకు రూ.538 కోట్లు ఇవ్వాలని చెప్పింది. ఇది కొచ్చి టాస్కర్స్ కు ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరని తెలుసుకోవడానికి గూగుల్‌లో చాలా మంది సెర్చ్ చేస్తున్నారు.

25 మంది సభ్యుల జట్టుకు శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ జట్టులోని విదేశీ ఆటగాళ్ళు బ్రెండన్ మెకల్లమ్, స్టీవ్ స్మిత్, ఒవైస్ షా, ముత్తయ్య మురళీధరన్, తిసారా పెరెరా, స్టీవ్ ఓ'కీఫ్, బ్రాడ్ హాడ్జ్ మరియు మహేల జయవర్ధనే. వీరితో పాటు భారత స్టార్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, శ్రీశాంత్, ఆర్పీ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, వినయ్ కుమార్ కూడా కొచ్చి టస్కర్స్ జట్టులో ఉన్నారు.

అయితే 2012లో BCCI - ఫ్రాంచైజీ యజమానుల మధ్య వివాదాల కారణంగా ఆ జట్టును వదిలివేశారు. అలాగే 2012 - 2013 సంవత్సరాల్లో 9 జట్లతో IPL నిర్వహించబడింది. 2014లో పూణే వారియర్స్ జట్టును తొలగించడం ద్వారా జట్ల సంఖ్య 8కి తగ్గించబడింది. ఆ విధంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కలిసి కనిపించిన కొచ్చి టస్కర్స్ కేరళ, పూణే వారియర్స్ ఇండియా జట్ల శకం ముగిసింది.

Tags:    

Similar News