IPL:ఐపీఎల్లో ఆర్సీబీ జట్టును అందుకే కొన్నాను - విజయ్ మాల్యా
ఆర్సీబీ జట్టును అందుకే కొన్నాను;
IPL:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవాలనే తమ కలను ఎట్టకేలకు ఈ ఏడాది నెరవేర్చుకుంది. 2008 నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తమ కలను నిజం చేసుకుంది. ఆర్సీబీ గెలుపుపై ప్రశంసలు కురిపించిన ఆ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా.. ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ముంబై తృటిలో ఆ అవకాశాన్ని కోల్పోయింది.
ఐపీఎల్ ప్రారంభంలో జట్ల కొనుగోలు ప్రక్రియ జరుగుతున్నప్పుడు..లలిత్ మోడీ తన దగ్గరకు వచ్చి జట్టును కొనుగోలు చేయాలని కోరినట్లు విజయ్ మాల్యా తెలిపారు. లలిత్ మోడీ మాటలతో ప్రభావితమై..రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కొనాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దాదాప రూ. 476 కోట్లు పెట్టి టీమ్ ను కొనుగోలు చేసినట్లు విజయ్ మాల్యా చెప్పుకొచ్చారు.
అంతకుముందు ముంబై ఇండియన్స్తో సహా మొత్తం మూడు ఫ్రాంచైజీలకు బిడ్ వేసినట్లు తెలిపారు. అయితే ముఖేష్ అంబానీ అత్యధిక ధరకు బిడ్డింగ్ చేయడంతో ముంబై జట్టును కొనుగోలు చేయలేకపోయినట్లు గుర్తు చేసుకున్నారు. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీని కొనడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశ్యం తన విస్కీ బ్రాండ్ 'రాయల్ ఛాలెంజ్'ని ప్రోత్సహించడమేనని విజయ్ మాల్యా స్పష్టం చేశారు. క్రికెట్ పట్ల ప్రేమతో టీమ్ ను కొనుగోలు చేయలేదని చెప్పుకొచ్చాడు.
ఇక విరాట్ కోహ్లీ 18 ఏళ్లుగా ఒకే జట్టుకు ఆడడం గొప్ప విషయమని విజయ్ మాల్యా అన్నారు. రాహుల్ ద్రవిడ్, జాక్వెస్ కాలిస్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ వంటి ప్రపంచ స్టార్ ఆటగాళ్లను తీసుకున్నట్లు మాల్యా గుర్తుచేసుకున్నాడు. ‘‘బెంగళూరుకు ఐపీఎల్ ట్రోఫీని తీసుకురావడం నా కల. ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని జట్టును నిర్మించాను’’ అని మాల్యా అన్నారు.