Cricket:ఇంగ్లాండ్ పిచ్ లపై రఫ్పాడించిన భారత ఆటగాళ్లు వీళ్లే
రఫ్పాడించిన భారత ఆటగాళ్లు వీళ్లే;
Cricket: ఐపీఎల్ అయిపోయింది. జూన్ 20 నుండి ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ఎంపిక చేసింది. అయితే సవాలుతో కూడిన ఇంగ్లాండ్ పిచ్లపై భారత్ తరపున ఎవరు ఎక్కువ పరుగులు చేశారో చూద్దాం.
ఇంగ్లాండ్పై టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 భారతీయ ఆటగాళ్లు ఎవరంటే
మాస్టర్ బ్లాస్టర్ , క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్తో జరిగిన 32 టెస్ట్ల్లో 2535 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 51.73 సగటుతో సచిన్ 2535 పరుగులు సాధించాడు.
భారత మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ 38 టెస్ట్ మ్యాచ్ల్లో 2483 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 38.20 సగటుతో సునీల్ గవాస్కర్ 2483 పరుగులు చేశాడు.
'ది వాల్' గా పిలువబడే రాహుల్ ద్రవిడ్ 21 టెస్ట్ల్లో 1950 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలున్నాయి. 68.80సగటుతో రాహుల్ ద్రవిడ్ 1950 పరుగులు చేశాడు.
సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ 28 టెస్ట్ మ్యాచ్ ల్లో 1727 పరుగులు చేశాడు. ఇందులో4 సెంచరీలు. 6 హాఫ్ సెంచరీలు చేశాడు. 37.54సగటుతో విరాట్ కోహ్లీ 1727 పరుగులు సాధించాడు.
కర్ణాటక క్రికెట్ లెజెండ్ గుండప్ప విశ్వనాథ్ 30 టెస్ట్ మ్యాచ్ల్లో 1880 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు చేశాడు. 37.60 సగటుతో గుండప్ప విశ్వనాథ్ 1880 పరుగులు సాధించాడు.