BCCI:తొక్కిసలాటకు కారణం వారే.. బీసీసీఐ సీరియస్?
బీసీసీఐ సీరియస్?;
BCCI: ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సంబరాలు చేసుకోవడానికి వచ్చిన దాదాపు 11మంది విగతజీవులుగా మారడం అందరినీ కలిచివేసింది. లోపల సంబరాలు..బయట బాధితుల హాహాకారాలు అందరినీ బాధించాయి. ఈ ఘటనపై ఐపీఎల్ బోర్డు, బీసీసీఐ కూడా తీవ్రంగా స్పందించాయి.
బీసీసీఐ అసంతృప్తి
ఆర్సీబీ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట సంఘటనపై బీసీసీఐ విచారం వ్యక్తం చేసింది. ఈవెంట్ ను నిర్వాహకులు సరిగ్గా నిర్వహించలేదని ఆరోపించింది. కరెక్ట్ గా ప్లాన్ చేసి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని అభిప్రాయపడింది. ఈ ఘటన జరగడం దురదృష్టకమని.. ఇలాంటి విజయోత్సవ వేడుకలు జరిగినప్పుడు సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ అన్నారు.
నాకు సమాచారం లేదు : ఐపీఎల్ చైర్మన్
ఈ విన్నింగ్ సెలబ్రేషన్స్ కు సంబంధించి తనకు సమాచారం లేదని ఐపీఎల్ చైర్మన్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు. తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న ఆయన.. ఆర్సీబీ మేనేజ్మెంట్ తో మాట్లాడినట్లు చెప్పారు. అటు సోషల్ మీడియాలోనూ ఆర్సీబీని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆర్సీబీ కప్ గెలిచింది ప్రాణాలు తీయడానికా..?. ఆర్సీబీ, ప్రభుత్వం అత్యుత్సాహం వల్ల ప్రజల ప్రాణాలు పోయాయని దుమ్మెత్తిపోస్తున్నారు.