IPL 2026: ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ దురదృష్టం.. ఒక్క పరుగుతో నాలుగు సార్లు!
ఒక్క పరుగుతో నాలుగు సార్లు!
IPL 2026: ఐపీఎల్ లాంటి ధనాధన్ లీగ్లో గెలుపోటముల మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ, ఈ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ దురదృష్టం మరో స్థాయిలో ఉంది. ఒక్క పరుగు.. కేవలం ఒక్కటంటే ఒక్క పరుగు తేడాతో అత్యధిక సార్లు ఓడిపోయిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఒక అరుదైన, చేదు రికార్డును మూటగట్టుకుంది.
ఈ ప్రయాణం నిన్న మొన్నటిది కాదు. 2015లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో మొదటిసారి ఢిల్లీ ఇలాంటి ఓటమిని చవిచూసింది. విజయానికి చేరువగా వచ్చి, ఆఖరి నిమిషంలో ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. ఆ మరుసటి ఏడాదే.. అంటే 2016లో గుజరాత్ లయన్స్ జట్టుతో జరిగిన పోరులో కూడా సీన్ రిపీట్ అయ్యింది. గెలుపు ముంగిట బోల్తా పడి, మళ్ళీ ఆ ఒక్క పరుగు తేడాతోనే నిరాశగా వెనుతిరిగింది.
మరికొన్ని ఏళ్ల తర్వాత, 2021 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్ అభిమానులకి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు విజయం కోసం ఆఖరి వరకు పోరాడినా, విధి ఆ జట్టును కనికరించలేదు. కేవలం ఒక్క పరుగు దూరంలో గెలుపు ఆగిపోయింది. ఇలా వరుసగా కీలక మ్యాచ్లలో స్వల్ప తేడాతో ఓడిపోవడం ఢిల్లీ క్యాపిటల్స్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూనే ఉంది.
ఇక ఈ తాజా సీజన్లోనూ ఢిల్లీకి అదే శాపం వెంటాడింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మళ్ళీ ఢిల్లీకి ఒక్క పరుగు ఓటమే ఎదురైంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా నాలుగు సార్లు ఒక్క పరుగు తేడాతో ఓడిన జట్టుగా ఢిల్లీ నిలిచింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్కు ఇది ఒక మధుర జ్ఞాపకం. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో గెలవడం ఇదే తొలిసారి.