Formula E Car Race Case : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఏ2 అర్వింద్ ఐరోపా పర్యటనలో

అర్వింద్ ఐరోపా పర్యటనలో;

Update: 2025-06-17 15:15 GMT

Formula E Car Race Case :: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి 2గా ఉన్నాడు, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ విదేశీ పర్యటన చర్చనీయాంశంగా మారిందు. అప్పటి మంత్రి, ఈ కేసులో కేటీఆర్ని ఏసీబీ విచారిస్తున్నారు, ఈ తరుణంలో అర్వింద్ కుమార్ విదేశాల్లో ఉండటం రాజకీయంగా విమర్శలకు తావిచ్చాడు. అయితే ఆయన యూరోప్లో చదువుతున్న తన కూతురి గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనేందుకు ప్రభుత్వ అనుమతితోనే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2నుంచి 30వరకు ఆయనకు విదేశాలకు వెళ్ళడానికి అనుమతితోనే సెలవును జారీ చేశారు. ఇందుకు ఏప్రిల్ 15న అప్పటి సీఎస్ శాంతికుమారి ఆయనకు సెలవును మంజూరీ చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో అవకతవకలు జరిగాయని. భారీగా నిధుల మళ్ళింపు జరిగిందని నిర్ధారించిన ఏసీబీ, ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ ఈ కేసులో చేర్చింది. ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ను గత ఏడాది డిసెంబర్ 31 వరకు అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. కేటీఆర్ను ఎలాంటి అరెస్ట్ చేయవద్దంటూ డిసెంబర్ 31న జరిగిన విచారణలో పోలీసులను ఆదేశిస్తూ.. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా మరోసారి ఏసీబీ విచారణ ముమ్మరం చేయడంతో కేటీఆర్ హాజరవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్టుపై అనేక ఊహాలు చెలరేగుతున్నాయి. ఈ అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కీలక సమయంలో అర్వింద్ కుమార్ లేకపోవడంపై రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం అనుమతితో అర్వింద్ కుమార్ సెలవు ఉత్తర్వులను వెలుగులోకి తెచ్చింది. వచ్చే నెలలో అర్వింద్ కుమార్ రాష్ట్రానికి రానున్నాడు.

Tags:    

Similar News