MLA Rajagopalreddy : నాకు అన్యాయం జరిగినా ఓకే… మునుగోడుకు న్యాయం జరగాలి
మరోసారి కాంగ్రెస్పై గళమెత్తిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి;
మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో నిత్యం తన అసమ్మతి రాగాన్ని ఆలపిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మాట్లడుతూ నాకు అన్యాయం జరిగితే మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగినట్లే అని మునుగోడు కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయద్దని గత ప్రభుత్వానికి చెప్పా… ఇప్పటి ప్రభుత్వానికి కూడా చెపుతున్నాఅని రాజగోపాల్రెడ్డి అన్నారు. మీరు మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చారు ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ అప్పటి వరకు మాత్రం మునుగోడు అభివృద్ధి విషయంలో ఒక్క రూపాయి కూడా ఆపవద్దని రాజగోపాల్రెడ్డి కోరారు. సమీకరణలు కుదరక ఇస్తామన్న మాట ఆలస్యమైందని అంటున్నారు… ఎవరు అడ్డుకుంటున్నారు నా మంత్రి పదవిని అని రాజగోపాల్రెడ్డి నిలదీస్తున్నారు. నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేము ఇద్దరం అన్నదమ్ములం అని, పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండో సారి ప్రమాణం చేసినప్పుడు తెలియదా మేము ఇద్దరు అన్నదమ్ములం ఉన్నామని అని రాజగోపాల్రెడ్డి సొంతపార్టీపై ప్రశ్నలను సంధిస్తున్నారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఆయన కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండడం తప్పెలా అవుతుందన్నారు. ఇద్దరం అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్లమే ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని రాజగోపాల్రెడ్డి అంటున్నారు. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా ఈ ప్రాంతానికి మాత్రం అన్యాయం చేయొద్దు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని రాజగోపాల్రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భువనగిరి పార్లమెంటు నుండి ఎంపీగా పని చేశాను నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పని చేశాను నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉంది… ప్రభుత్వ దవాఖానకు పోతే పేదోడికి న్యాయం జరగాలి, ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు పాఠశాలలు పేదవాడి రక్తం తాగుతున్నాయి పేదవాళ్ల కండగా ఉండాలని నేను కష్టపడుతున్న ఆ భగవంతుడు ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదు అని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు.